ఆ గుర్తులు మా కొద్దు…తొలగించండి…!!

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొద్దిసేపటి క్రితం కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిశారు. కొన్ని గుర్తులు కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని, వాటిని తొలగించాల్సిందిగా ఎన్నికల [more]

Update: 2018-12-27 11:42 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొద్దిసేపటి క్రితం కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిశారు. కొన్ని గుర్తులు కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని, వాటిని తొలగించాల్సిందిగా ఎన్నికల కమిషన్ కు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఇస్త్రీపెట్టె, ట్రక్కు గుర్తులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రెండు గుర్తులు కారు గుర్తును పోలి ఉండటంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సయితం తాము కొన్ని చోట్ల మెజారిటీని కోల్పోవడమే కాకుండా, కొన్ని చోట్ల ఓడిపోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. అలాగే తొలగించిన ఓట్లను కూడా తిరిగి చేర్చాలని, పార్లమెంటు ఎన్నికలలోపు తొలగించిన ఓట్లను జాబితాలో చేర్చాలని ఆయన ఎన్నికల కమిషన్ ను కోరారు.

Tags:    

Similar News