ఏపీ సరిహద్దుల్లో జాగ్రత్త…. కేసీఆర్ హెచ్చరిక

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నియంత్రణ, లాక్ డౌన్ పై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ సరిహద్దు గ్రామాల్లో జాగ్రత్తగా ఉండాలని [more]

Update: 2020-05-06 13:05 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నియంత్రణ, లాక్ డౌన్ పై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ సరిహద్దు గ్రామాల్లో జాగ్రత్తగా ఉండాలని కోరారు. ముఖ్యంగా గుంటూరు, కర్నూలు జిల్లాల సరిహద్దు గ్రామాల్లో నిఘాను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అక్కడి నుంచి ఎవరిని రాష్ట్రంలోకి అనుమతించవద్దని కోరారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువ కేసులు నమోదు అవుతుండటంతో అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. ఈ మూడు జిల్లాల్లో్నే కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఈ మూడు జిల్లాల్లో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News