కొనసాగింపే… మినహాయింపులు లేవట

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈరోజు జరిగే మంత్రి వర్గ సమావేశంలో లాక్ డౌన్ కొనసాగింపు, మినహాయింపులపై ఆయన [more]

Update: 2020-05-05 02:28 GMT

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈరోజు జరిగే మంత్రి వర్గ సమావేశంలో లాక్ డౌన్ కొనసాగింపు, మినహాయింపులపై ఆయన చర్చించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ ను కొనసాగించాలని భావిస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పలువురి అభిప్రాయాలను తెలుసుకున్న కేసీఆర్ తెలంగాణలో లాక్ డౌన్ ను కొనసాగించి మినహాయింపులు ఏవీ ఇవ్వకూడదని భావిస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషిస్తూనే కరోనాను కట్టడి చేయాలన్న భావనలో కేసీఆర్ ఉన్నారు.

Tags:    

Similar News