విద్యుత్తు ఛార్జీలు పెంచబోతున్నాం..సహకరించండి

భారతదేశంలో 24 గంటలు నిరంతరాయంగా అందరికి విద్యుత్తు సరఫరా చేస్తుంది ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నాణ్యమైన విద్యుత్తును అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. [more]

Update: 2020-03-13 06:43 GMT

భారతదేశంలో 24 గంటలు నిరంతరాయంగా అందరికి విద్యుత్తు సరఫరా చేస్తుంది ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నాణ్యమైన విద్యుత్తును అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అదే సమయంలో విద్యుత్తు ఛార్జీలు పెంచినా ప్రజలు సహకరించాలని కోరారు. వసతులు కావాలంటే భారం భరించక తప్పదని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. త్వరలోనే విద్యుత్తు ఛార్జీలు పెంచబోతున్నట్లు కేసీఆర్ అసెంబ్లీలో సంకేతాలు ఇచ్చారు. అభివృద్ధి కోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పే తాను చేస్తానని కేసీఆర్ అన్నారు.

Tags:    

Similar News