రేపు ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. దళిత ఎంపవర్ మెంట్ పై అఖిలపక్షంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించనున్నారు. ఉదయం [more]

Update: 2021-06-26 03:14 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. దళిత ఎంపవర్ మెంట్ పై అఖిలపక్షంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరగనున్న ఈ సమావేశంలో దళితలకు సంబంధించిన సమస్యలపై చర్చించనున్నారు. వారి ఉపాధి అవకాశాలు, వారికి కేటాయించిన నిధుల వినియోగం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో అన్ని పార్టీలకకు చెందని దళిత ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఇక కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు కూడా పాల్గొననున్నారు. సీపీఐ, సీపీఎం లకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి.

Tags:    

Similar News