వైసీపీలో బీజేపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి చేరిపోయారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువాను కప్పుకున్నారు. కృష్ణా జిల్లాలోని కనుమూరు సమీపంలో పాదయాత్ర చేస్తున్న జగన్ ను కాటసాని కలిసి పార్టీలో చేరారు. జగన్ ఆయనకు సాదరంగా పార్టీలోకి స్వాగతించారు. జగన్ ఆదేశాల మేరకు తాను పార్టీలో పనిచేస్తానని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పాణ్యం నియోజకవర్గం గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు.