సభలో అలా జరిగితే?

Update: 2018-05-19 03:31 GMT

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపట్లో జరుగుతుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్ర డీజీపీ విధానసభను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. రెండు వర్గాలు అమితుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతుండటంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశముందన్న సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విధానసభ వద్దకు ఏ పార్టీ కార్యకర్తలను రాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రొటెం స్పీకర్ నియమితులైన బొప్పయ్య పోలీసు అధికారులు, అసెంబ్లీ ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. మొత్తం మీద కర్ణాటక విధానసభ వద్ద టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి.

Similar News