కన్నాపై బాబు సెటైర్లు

Update: 2018-05-29 07:39 GMT

మహానాడులో చంద్రబాబు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై తీవ్ర విమర్శలు చేశారు. ఆరోజు కాంగ్రెస్ లో ఉండి విభజన జరిగే సమయంలోనూ కన్నా మౌనంగానే ఉన్నారన్నారు. మొన్నటికి మొన్న వైసీపీలోకి వెళ్లేందుకు ఫ్లెక్సీలు కూడా వేయించుకుని రెడీ అయిపోయి, ఆ తర్వాత ఆసుపత్రిలో చేరి, చివరకు బీజేపీలోనే ఉన్నారన్నారు. అటువంటి కన్నాలక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదన్నారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి అద్దె మైకు, వైసీపీకి సొంత మైకుగా వ్యవహరిస్తున్నారన్నారు.

Similar News