రెయినో బోకు కూడా రంగులేస్తారు

వైసీపీ నేతలు ఇంద్రధనస్సుకు కూడా రంగులు వేస్తారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. ఆయన ట్విట్టర్లో వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ [more]

Update: 2019-11-13 06:21 GMT

వైసీపీ నేతలు ఇంద్రధనస్సుకు కూడా రంగులు వేస్తారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. ఆయన ట్విట్టర్లో వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పిచ్చి పరాకాష్టకు చేరిందని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను, గుడులకు కూడా వైసీపీ రంగులు వేస్తున్నారన్నారు. అన్నవరంలో అన్యమత ప్రచారాన్ని వైసీపీ ప్రారంభించిందన్నారు. బీమిలీ ఉత్సవ్ లో సయితం మతపరమైన స్టాల్స్ ను ఏర్పాటు చేశారని, ఈ రాష్ట్రం ఎటు పోతుందోనన్న ఆందోళనను కన్నా లక్ష్మీనారాయణ వ్యక్తం చేశారు.

Tags:    

Similar News