బ్రేకింగ్ : కన్నా కోడలు మృతిలో కొత్త ట్విస్ట్

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతిపై కొత్త కోణం వెలుగు చూసింది. తన భార్య సుహారిక మృతిపై తనకు అనుమానాలున్నాయని ఫణీంద్ర పోలీసులకు [more]

Update: 2020-07-24 12:52 GMT

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతిపై కొత్త కోణం వెలుగు చూసింది. తన భార్య సుహారిక మృతిపై తనకు అనుమానాలున్నాయని ఫణీంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుహారికకు ఎలాంటి చెడు అలవాట్లు లేవన్నారు. ఆరోజు డ్రగ్స్ పార్టీ జరిగినట్లు ప్రచారం జరిగిందన్నారు. ఆ పార్టీలో పాల్గొన్న నలుగురు తప్పించుకు తిరుగుతున్నారని ఫణీంద్ర చెబుతున్నారు. తొలుత సీబీఐటీ వద్ద చనిపోయిందన్నారని, తర్వాత మాటమార్చారని చెప్పారు. అయితే తన తోడల్లుడుతో ఆర్థిక వివాదాలున్నాయని ఆయన చెప్పారు. అసలు నిజాలు బయటకు రావడం లేదన్నారు. తన భార్యది హత్యా? ఆత్మహత్య అన్నది తేల్చాలని కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు ఫణీంద్ర సైబరాబాద్ పోలీసులను కోరుతున్నారు.

Tags:    

Similar News