జగన్ ను కన్నా ఏం కోరారంటే?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. విశాఖలో గ్యాస్ లీక్ సంఘటనపై న్యాయవిచారణ జరపాలని కోరారు. హైకోర్టు [more]

Update: 2020-05-09 07:59 GMT

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. విశాఖలో గ్యాస్ లీక్ సంఘటనపై న్యాయవిచారణ జరపాలని కోరారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై ఈ ప్రమాదంపై విచారణ జరపాలని కన్నా లక్ష్మీనారాయణ కోరారు. ఈ ప్రమాదంలో బాధితులంతా పేదలే కాబట్టి, వారికి అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రమాదంలో పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తుందన్నారు. ఆ గ్రామాల ప్రజలందరికీ ప్రత్యేక ఆరోగ్య కార్డులను మంజూరు చేయాలని కన్నా లక్ష్మీనారాయణ జగన్ కు లేఖ రాసిన లేఖలో కోరారు.

Tags:    

Similar News