గ్రౌండ్ లో ఉన్నది మనమే

గ్రౌండ్ లో మనం తప్ప ఎవరూ లేరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమై మున్సిపల్ ఎన్నికలపై సమీక్షించారు. రెబల్స్ ను బుజ్జగించాలని [more]

Update: 2020-01-09 06:41 GMT

గ్రౌండ్ లో మనం తప్ప ఎవరూ లేరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమై మున్సిపల్ ఎన్నికలపై సమీక్షించారు. రెబల్స్ ను బుజ్జగించాలని సూచించారు. ఏ పరిస్థితుల్లో వారికి టిక్కెట్ ఇవ్వలేకపోతున్నామో వివరించాలన్నారు. అప్పటికి వినకుంటే కఠినంగా ఉంటామని హెచ్చరించాలని కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మనకే సానుకూల ఫలితాలు వస్తాయన్నారు. ఈ సందర్భంగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశానికి ఆలస్యంగా రావడంపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డిలతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు ఆలస్యంగా రావడాన్ని తప్పుపట్టారు. క్రమశిక్షణ మంత్రులే పాటించకుంటే ఎలా? అని ప్రశ్నించారు. రాజకీయ నేతల మధ్య విభేదాలు సహజమని, సర్దుకుపోవాలని సూచించారు. ఈ సందర్భంగా బీ ఫారాలను ఎమ్మెల్యేలకు అందజేశారు.

Tags:    

Similar News