కౌశిక్ రెడ్డికి మంచి భవిష్యత్ ఉంది

టీఆర్ఎస్ రాజకీయ పార్టీ అని, దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నుంచే ప్రారంభిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కౌశిక్ రెడ్డికి కండువా కప్పి ఆయన టీఆర్ఎష్ [more]

Update: 2021-07-21 12:43 GMT

టీఆర్ఎస్ రాజకీయ పార్టీ అని, దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నుంచే ప్రారంభిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కౌశిక్ రెడ్డికి కండువా కప్పి ఆయన టీఆర్ఎష్ లోకి ఆహ్వానించారు. విపక్షాల విమర్శలను కేసీఆర్ తిప్పికొట్టారు. ఎన్నికల కోసమే దళితుల బంధు పథకం ప్రవేశపెడుతున్నామనడం సరికాదన్నారు. ఈ పథకం ద్వారా పది లక్షలతో కుటుంబం సాధికారత సాధించవచ్చని కేసీఆర్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు ఓడటం, గెలవడం సాధారణమేనన్నారు. ఎవరూ అధికారంలో శాశ్వతంగా ఉండరని చెప్పారు. కౌశిక్ రెడ్డి రాకతో హుజూరాబాద్ లో టీఆర్ఎస్ మరింత బలోపేతం అయిందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం ఇప్పుడే ప్రారంభమయిందని కేసీఆర్ చెప్పారు. కౌశిక్ రెడ్డికి మంచి భవిష్యత్ ఉందని కేసీఆర్ తెలిపారు. కేవలం హుజూరాబాద్ కే పరిమితం చేయమని, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సేవలు వాడుకుంటామని కేసీఆర్ చెప్పారు.

Tags:    

Similar News