పవన్ పై జోగి హార్ష్ కామెంట్స్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ‌్ తో పాటు టీడీపీ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు పీకే [more]

Update: 2020-02-17 13:13 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ‌్ తో పాటు టీడీపీ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు పీకే అంటే పిచ్చికుక్క అని జోగి రమేష్ వ్యాఖ్యానించారు. మెదడు లేని మేధావి యనమల, అచ్చోసిన ఆంబోతు లాంటి అచ్చెన్నాయుడు, బొంకలేక బొంకే బొచ్చయ్య చౌదరి, సొల్లు దేవినేని ఉమ, బుద్ధిలేని బుద్ధా వెంకన్న, లోకజ్ఞానం లేని లోకేష్, రాజకీయ పరిజ్ఞానం లేని పీకే వంటి వారు కరోనా వైరస్ కన్నా ప్రమాదకరమని జోగి రమేష్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగినా తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు జోగి రమేష్. గతంలో ఎవరూ చేయని విధంగా హార్ష్ కామెంట్స్ జోగి రమేష్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News