ప్రధానికి జేడీ లక్ష్మీనారాయణ లేఖ

మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేయవద్దని కోరారు. సముద్ర తీరంలో ఉన్న ఏకైక [more]

Update: 2021-03-13 00:37 GMT

మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేయవద్దని కోరారు. సముద్ర తీరంలో ఉన్న ఏకైక ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ అని జేడీ లక్ష్మీనారాయణ తన లేఖలో పేర్కొన్నారు. రానున్న కాలంలో ఉక్కుకు డిమాండ్ పెరగనుందని, దీనిని ప్రయివేటీకరిస్తే సిమెంట్ పరిశ్రమలకు పట్టిన గతే పడుతుందని జేడీ లక్ష్మీనారాయణ తన లేఖలో పేర్కొన్నారు. సర్దార్ పటేల్ విగ్రహానికి 3200 టన్నులు, అటల్ టన్నెల్ కోసం 2,200 టన్నుల స్టీల్ ను విశాఖ నుంచే పంపారన్న విషయాన్ని జేడీ లక్ష్మీనారాయణ గుర్తు చేశారు.

Tags:    

Similar News