జగన్ నీకు భయపడేది లేదు

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాను ఎవరికీ భయపడేది లేదని చెబుతున్నారు. తాజాగా ఆయనకు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సుకు చెందిన ఆరు బస్సులను సీజ్ [more]

Update: 2019-12-31 08:05 GMT

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాను ఎవరికీ భయపడేది లేదని చెబుతున్నారు. తాజాగా ఆయనకు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సుకు చెందిన ఆరు బస్సులను సీజ్ చేయడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. బస్సుల సీజ్ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పారు. జేసీ దివాకర్ రెడ్డికి 70, తనకు 67 ఏళ్లని ఇప్పుడు ఎవరైనా తమను ఏం చేయగలరని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఇంతకు మించి మమ్మల్ని ఏం చేయగలరని ప్రశ్నించారు. ఎక్కడా తాము నిబంధనలను ఉల్లంఘించడం లేదన్నారు. తమ బస్సులను పక్క జిల్లాల ఆర్టీవోలతో సీజ్ చేయిస్తున్నారన్నారు. రవాణా సంస్థ ఏమీ లాభాల్లో లేదని చెప్పారు. పార్టీ మారాలని వేధింపులకు గురి చేస్తున్నారని, వాటికి భయపడబోమని తెలిపారు. నీకు భయపడేది లేదని జగన్ ను జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఎన్ని బెదిరింపులు చేసినా తాము పార్టీ మారబోమని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News