షర్మిలపై జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు

వై.ఎస్.షర్మిల తనకు కూతురితో సమానమని, ఆమె విమర్శిస్తే తనకు పాపం తగులుతుందని తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ఆయన షర్మిల వివాహంపై [more]

Update: 2019-01-16 08:14 GMT

వై.ఎస్.షర్మిల తనకు కూతురితో సమానమని, ఆమె విమర్శిస్తే తనకు పాపం తగులుతుందని తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ఆయన షర్మిల వివాహంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ అమరావతిలో చంద్రబాబుతో భేటీ అయిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ… కులాంతర వివాహం చేసుకున్నందుకు వైఎస్ కుటుంబాన్ని గతంలోనే అభినందించానని తెలిపారు.

కొత్తగా కలిసేదేముంది…?

కులాంతర వివాహానికి అనుమతిచ్చిన వైఎస్ కుటుంబం ఇప్పుడు కులాలను రెచ్చగొట్టడాన్ని మాత్రమే విమర్శించినట్లు తెలిపారు. జగన్ – కేటీఆర్ భేటీపై స్పందించిన ఆయన ఇప్పుడు కొత్తగా కలిసేదేముందని, ఏడాదిగా ఆ రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయన్నారు. కేసీఆర్ తో కలిసి మరో 10 మంది వచ్చి ఏపీలో టీడీపీని ఏమీ చేయలేరని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News