మోడీ పై జేసీ షాకింగ్ కామెంట్స్

Update: 2018-06-22 09:37 GMT

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఒక వర్గాన్ని హత్యలు చేయించిన మోడీ ప్రధానిగా ఉండే అర్హత లేదని జేసీ వ్యాఖ్యానించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం మూడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న సీఎం రమేష్ ను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఇలాంటి దీక్షల వల్ల స్టీల్ ప్లాంట్ రాదని తేల్చి చెప్పారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి ఏమీ చేయరన్న విషయాన్ని మూడున్నరేళ్ల క్రితమే చంద్రబాబుకు చెప్పారన్నారు. ఇలాంటి కేంద్ర ప్రభుత్వం ఉండటం మన ఖర్మ అని వ్యాఖ్యానించారు.

Similar News