బ్రేకింగ్ : బీజేపీ పెద్దలతో పవన్ భేటీ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ కేంద్ర నాయకత్వంతో భేటీ అవుతున్నారు. సుదీర్ఘకాలం తర్వాత పవన్ కల్యాణ్ బీజేపీ నేతలతో బేటీ అవుతుండటం విశేషం. కొద్దిసేపటి క్రితం [more]

Update: 2019-11-15 05:45 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ కేంద్ర నాయకత్వంతో భేటీ అవుతున్నారు. సుదీర్ఘకాలం తర్వాత పవన్ కల్యాణ్ బీజేపీ నేతలతో బేటీ అవుతుండటం విశేషం. కొద్దిసేపటి క్రితం పవన్ కల్యాణ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ప్రధాని నరేంద్రమోడీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసే అవకాశముంది. కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముందని జనసేన వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలతో చర్చించనున్నారు. రాజధాని నిర్మాణం, ఇసుక కొరత వంటి సమస్యలను పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దల వద్ద ప్రస్తావించే అవకాశముంది. లాంగ్ మార్చ్ రోజే పవన్ కల్యాణ్ తాను త్వరలో ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలుస్తానని చెెప్పిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News