ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అప్పుల్లో ఉన్నారు

పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపై ఆ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బాగా [more]

Update: 2019-05-07 11:44 GMT

పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపై ఆ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బాగా క‌ష్ట‌ప‌డ్డార‌ని, ఆయ‌న ఎవ‌రి ద‌గ్గ‌రా డ‌బ్బులు తీసుకోలేద‌ని, ఆయ‌నే అప్పుల్లో ఉన్నార‌ని చెప్పారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో చిట్ చాట్ మాట్లాడుతూ… ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి త‌ర‌కు ప‌ద‌వి వ‌ద్దూ అని త‌ప్పుకుంటే త‌ప్ప పీసీసీ మార్పు ఉండ‌ద‌ని పేర్కొన్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు మెరుగైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, అయితే, కేసీఆర్‌, చంద్ర‌బాబు, జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కీల‌క‌మ‌య్యే అవ‌కాశం ఉండ‌వ‌చ్చ‌ని అనుమానం వ్య‌క్తం చేశారు.

Tags:    

Similar News