అన్న వ‌స్తున్నాడు అని చెప్పండి

చంద్ర‌బాబు మోస‌పూరిత పాల‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ వైసీపీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. గురువారం ఆయ‌న క‌డ‌ప జిల్లాలో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మ‌ర శంఖారావం స‌భ [more]

Update: 2019-02-07 11:07 GMT

చంద్ర‌బాబు మోస‌పూరిత పాల‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ వైసీపీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. గురువారం ఆయ‌న క‌డ‌ప జిల్లాలో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మ‌ర శంఖారావం స‌భ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ… క‌డ‌ప గ‌డ్డ త‌న కుటుంబానికి ఎంతో ఇచ్చింద‌ని పేర్కొన్నారు. క‌డ‌ప ప్ర‌జ‌లు ఆద‌రించ‌బ‌ట్టే తాము రాష్ట్రంలో వైపు చూడ‌గ‌లుగుతున్నామ‌ని అన్నారు. త్వ‌ర‌లోనే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రానుంద‌ని, పార్టీ శ్రేణులంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరారు. ఎన్నిక‌ల వేళ చంద్ర‌బాబు తీసుకువ‌స్తున్న ప‌థ‌కాలు, శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాల్లోని మోసాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని కోరారు. జ‌గ‌న‌న్న వ‌స్తున్నాడు అని.. పింఛ‌న్ 3 వేలు చేస్తాడ‌ని ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు. న‌వ‌ర‌త్నాల ద్వారా పేద‌ల జీవితాలు మారుస్తాడ‌ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌న్నారు. ఓట‌ర్ల జాబితాలో అవ‌క‌త‌వ‌ల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరారు.

Tags:    

Similar News