వైఎస్ జగన్ పై జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు

Update: 2018-11-04 12:40 GMT

వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిన్న కోడికత్తితో గాయమైతే ఇంత డ్రామాలు అవసరమా? జగన్న అంటూ జేసీ ప్రశ్నించారు. జగన్ కు కామెన్ సెన్స్ లేదన్నారు. జగన్ పట్టిసీమను వద్దన్నప్పుడే ఆయన మానసిక స్థితి అర్థమయిందన్నారు. కనీసం తిత్లీ తుపాను బాధితులను కూడా పరామర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ కు రెడ్లు ఎవరూ ఓట్లు వేయవద్దని పిలుపు నిచ్చారు. మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అనంతపురం జిల్లాకు నీళ్లువస్తాయని జేసీ తెలిపారు. జగన్ ఏపీకి శనిలా దాపురించారని ఫైరయ్యారు జేసీ.

Similar News