బ్రేకింగ్ : ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు

Update: 2018-09-18 06:45 GMT

టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఇన్ కం ట్యాక్స్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. జూబ్లీహిల్స్, ఖమ్మంలోని ఆయన నివాసాలతో పాటు కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న పొంగులేటి గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున విజయం సాధించి టీఆర్ఎస్ లో చేరారు. వివిధ రాష్ట్రాల్లో ఆయన కాంట్రాక్టులు చేస్తున్నారు. అయితే, సోదాలకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Similar News