జానా, షబ్బీర్ లకు షాక్

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీకి తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడుకున్నందుకు డబ్బులు [more]

Update: 2019-01-05 13:07 GMT

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీకి తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడుకున్నందుకు డబ్బులు చెల్లించాలని వారికి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డి 87 రోజులు బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడినందుకు కిలోమీటర్ కు రూ. 37, డ్రైవర్ బత్తా రోజుకు రూ.100 చొప్పున మొత్తం రూ.4.20,094 కట్టాలని స్పష్టం చేసింది. ఇక, షబ్బీర్ అలీ 90 రోజులు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ వాడినందుకు ఇదే లెక్క ప్రకారం రూ.4,79,936 చెల్లించాలని నోటీసులు అందాయి.

Tags:    

Similar News