కాంగ్రెస్ సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో విందు సమావేశానికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ కు ఇచ్చే విందుకు కాంగ్రెస్ [more]

Update: 2020-02-25 03:53 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో విందు సమావేశానికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ కు ఇచ్చే విందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందలేదు. దీంతో కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత అధిర్ రంజన్ కు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆహ్వానాలు అందాయి. అయితే సోనియా గాంధీకి ఆహ్వానం లేకపోవడంతో తాను విందుకు వెళ్లడం లేదని అధీర్ రంజన్ చౌదరి ఇప్పటికే ప్రకటించారు. అయితే నిన్నటి వరకూ విందుకు హాజరవుతానన్న మన్మోహన్ సింగ్ ఈరోజు మాత్రం అనారోగ్య కారణాల వల్ల హాజరుకాలేక పోతున్నట్లు చెప్పారు. సోనియా గాంధీకి ట్రంప్ విందుకు ఆహ్వానం అందకపోవడం వల్లనే కాంగ్రెస్ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.

Tags:    

Similar News