హిందూపురంలో టీడీపీకి దెబ్బ.. సీనియర్ నేత జంప్

హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత రంగనాయకులు వైసీపీలో చేరారు. పార్టీ ఆవిర్భావం నుంచి రంగనాయకులు టీడీపీలో ఉన్నారు. 1983లో [more]

Update: 2021-02-24 03:06 GMT

హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత రంగనాయకులు వైసీపీలో చేరారు. పార్టీ ఆవిర్భావం నుంచి రంగనాయకులు టీడీపీలో ఉన్నారు. 1983లో ఆయన తొలిసారి హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లోనూ మరోసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు రంగనాయకులు టీడీపీని వీడటం ఆ పార్టీకి ఎదురుదెబ్బ. రంగనాయకులు వైసీపీ ఇన్ ఛార్జి మహ్మద్ ఇక్బాల్ సమక్షంలో వైసీపీలో చేరారు.

Tags:    

Similar News