కోట్లు ఉన్నా.... తనకంటే చిన్న అయిన యువకుడితో.....!

Update: 2018-06-27 06:47 GMT

వాళ్లకు కోట్ల రూపాయల ఆస్తులున్నాయ్. ఆమె వ్యాపారవేత్త భార్య. భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంతోషంగా సాగిపోతున్న కాపురంలో మూడో వ్యక్తి ప్రవేశించాడు. తనకంటే వయస్సులో పదేళ్ల చిన్నోడైన యువకుడితో గుట్టుగా ప్రేమాయణం సాగించింది ఆ వివాహిత. అనుమానించిన భర్త ఆమె కారుకు జీపీఎస్ అమర్చాడు. భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలి ప్రియుడితో కలిసి గోవాకు కారులో వెళ్లిపోయింది. పెళ్లి చేసుకుని వైవాహిక బంధాన్ని విచ్చిన్నం చేసి.. నమ్మకద్రోహానికి పాల్పడిన భార్యపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తనకంటే పదేళ్లు చిన్న.....

ఆమె వయస్సు 35 సంవత్సరాలు. ప్రియుడి వయస్సు 25. వయస్సులో పదేళ్ల చిన్నోడతను. పేరు మాధవ్.. ఇతనికింకా పెళ్లి కాలేదు. ఆమెకు పెళ్లై ఇద్దరు కుమార్తెలున్నారు. భర్త బిజినెస్ పనిమీద హైదరాబాద్, నెల్లూరు, విజయవాడకు క్యాంపులకు వెళ్తుంటాడు. ఈమె కూడా వ్యాపారపనులు నిర్వహించేది. ఓ రోజు కారు వాష్ చేయించేందుకు వెళ్లిన ఆమెకు ఆ కార్ వాష్ సంస్థ యజమానైన కుర్రోడు పాతికేళ్ల మాధవ్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ కలిసి చాటింగ్ లు చేసుకోవడం, రహస్యంగా రాసలీలలు కొనసాగించేవారు.

భర్త పిల్లల్ని పట్టించుకోకుండా.....

భర్త, పిల్లల్ని పట్టించుకునేది కాదు. ఓ రోజూ వారిద్దరూ అమీర్ పేట్ ధరంకరంరోడ్డులో రహస్యంగా కలుసుకున్న ఇంట్లో వారిద్దర్నీ భర్త పట్టుకున్నాడు. తనింకా తప్పు చేయనంది. మన్నించమంది. పుట్టింటికి వెళ్లిపోతానని చెప్పిన ఆమె కారులో ప్రియుడ్ని ఎక్కించుకుని గోవాకు పారిపోయింది. గోవాలో ఓ హోటల్లోకి కారు చేరుకున్నట్టు జీపీఎస్ ద్వారా భర్త తెల్సుకుని ఎస్.ఆర్.నగర్ పోలీసుల్ని ఆశ్రయించాడు. తనని మోసం చేసి నమ్మకద్రోహానికి పాల్పడ్డ తన భార్యను, ఆమె ప్రియుడు మాధవ్ ను పట్టుకోవాలని పోలీసుల్ని వేడుకుంటున్నాడు బాధితుడు. ఆమె దగ్గర తన కూతుళ్లు ఉంటే వారు చెడుదోవలోకి వెళ్లే ప్రమాదం ఉందని..పిల్లల్ని తనకు ఇప్పించాలంటున్నాడు బాధితుడు.

Similar News