సెకండరీ కాంట్రాక్ట్ కేసులు కావడంతో హైదరాబాద్ లో?

హైదరాబాద్ లో తాజాగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులన్నీ సెకండరీ కాంట్రాక్టులుగా అధికారులు గుర్తించారు. నిన్న ఒక్కరోజే తెలంగాణలో నలభై కేసులు నమోదయ్యాయి. ఇందులో 33కరోనా పాజటివ్ [more]

Update: 2020-05-16 04:45 GMT

హైదరాబాద్ లో తాజాగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులన్నీ సెకండరీ కాంట్రాక్టులుగా అధికారులు గుర్తించారు. నిన్న ఒక్కరోజే తెలంగాణలో నలభై కేసులు నమోదయ్యాయి. ఇందులో 33కరోనా పాజటివ్ కేసులు హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1454కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 34 మంది తెలంగాణలో మరణించారు. వలస కూలీల ద్వారా వైరస్ సోకుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణలో 461 యాక్టివ్ కేసులున్నాయి. వనస్థలిపురం, ఎల్బీ నగర్ లో ఎక్కువ కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

Tags:    

Similar News