బ్రేకింగ్ : హైదరాబాద్ పేలుళ్ల కేసులో దోషులకు ఉరి శిక్ష

Update: 2018-09-10 12:40 GMT

2007లో హైదరాబాద్ లోని గోకుల్ చాట్, లుంబిని పార్క్ లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ1 అక్బర్ ఇస్మాయిల్ చౌదురి, ఏ2 అనీక్ సయ్యద్ లకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. వీరికి ఆశ్రయం కల్పించిన తారీఖ్ అంజూమ్ కు యావజ్జీవ శిక్ష విధించింది. చర్లపల్లిలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ కేసులో ఇంతకుముందే వీరి ముగ్గురినీ దోషులుగా తేల్చి, ఇవాళ శిక్ష ఖరారు చేసింది. 2007 ఆగస్టు 25న వరుసగా జరిగిన ఈ పేలుళ్లలో 44 మంది అమాయకులు ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే.

Similar News