హుజూర్ నగర్ బరిలో 28మంది

హుజూర్ నగర్ లో ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఉప ఎన్నికల బరిలో మొత్తం 28మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధాన పార్టీల నుంచి టి.ఆర్ఎస్ [more]

Update: 2019-10-03 14:59 GMT

హుజూర్ నగర్ లో ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఉప ఎన్నికల బరిలో మొత్తం 28మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధాన పార్టీల నుంచి టి.ఆర్ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డి, టీడీపీ నుంచి కిరణ్మయి, బీజేపీనుంచి రామారావు బరిలో ఉన్నారు. మొత్తం 76 నామినేషన్లు రాగా అందులో 45 వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. మొత్తానికి బరిలో 28 మంది నిలిచారు. ఈ నెల 21న హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరుగనుంది.

 

Tags:    

Similar News