మూడో సారి హై పవర్ కమిటీ

అమరావతి రాజధాని అంశంపై హైపవర్ కమిటీ మూడోసారి సమావేశం కానుంది. ఇప్పటికే రెండు సార్లు భేటీ అయిన హైపవర్ కమిటీ మరికాసేపట్లో సమావేశమై కీలక అంశాలపై చర్చించనుంది. [more]

Update: 2020-01-13 04:27 GMT

అమరావతి రాజధాని అంశంపై హైపవర్ కమిటీ మూడోసారి సమావేశం కానుంది. ఇప్పటికే రెండు సార్లు భేటీ అయిన హైపవర్ కమిటీ మరికాసేపట్లో సమావేశమై కీలక అంశాలపై చర్చించనుంది. తొలి భేటీలో హై పవర్ కమిటీ జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెంట్ నివేదికలపై చర్చించింది. రెండోసారి భేటీలో రాజధాని ప్రాంతంలో ఉన్న రైతు సమస్యలు, ఉద్యోగుల సమస్యలు వంటి అంశాలపై చర్చించింది. ఈరోజు జరగబోయే సమావేశంలో ప్రభుత్వ ప్రతిపాదనపై చర్చలు జరపనుంది. ఈ సమావేశంలో మూడు రాజధానుల అంశంపై హై పవర్ కమిటీ ఒక క్లారిటీకి రానుంది.

Tags:    

Similar News