నేడు తుది తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికలు జరిగినా ఫలితాలు మాత్రం నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ ఆదేశాలిచ్చింది. [more]

Update: 2021-07-27 02:27 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికలు జరిగినా ఫలితాలు మాత్రం నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ ఆదేశాలిచ్చింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఇప్పటికే వాదనలు విన్న డివిజన్ బెంచ్ నేడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై తీర్పు చెప్పనుంది. కౌంటింగ్ నిలిపియేవడతో మండల, జిల్లా పరిషత్ లలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. తుది తీర్పు రానుండటంతో దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News