బ్రేకింగ్: డేటా చోరీ కేసులో జోక్యం చేసుకోం

ఆంధ్రప్రదేశ్ పౌరుల వ్యక్తిగత సమాచారం చోరీ కేసులో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. డేటా చోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్ కంపెనీ ఎండీ [more]

Update: 2019-03-04 06:40 GMT

ఆంధ్రప్రదేశ్ పౌరుల వ్యక్తిగత సమాచారం చోరీ కేసులో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. డేటా చోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్ కంపెనీ ఎండీ అశోక్ వేసిన హెబియస్ కార్పస్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఐటీ గ్రిడ్ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను తెలంగాణ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వీరిని తాము అరెస్ట్ చేయలేదని, కేవలం విచారణకు మాత్రమే పిలిపించామని పోలీసులు కోర్టు దృష్టికి తెలిపారు. ఉద్యోగులు సైతం తమను ఎవరూ అరెస్ట్ చేయలేదని జడ్జికి చెప్పారు.

Tags:    

Similar News