దారుణ హత్య.. కారణం ఎవరు?

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. హైకోర్టు న్యాయవాది దంపతులు దారుణహత్యకు గురయ్యారు. వారిపై దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. న్యాయవాది వామన్‌రావు, ఆయన భార్య [more]

Update: 2021-02-18 00:57 GMT

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. హైకోర్టు న్యాయవాది దంపతులు దారుణహత్యకు గురయ్యారు. వారిపై దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. న్యాయవాది వామన్‌రావు, ఆయన భార్య నాగమణి మంథని కోర్టులో పని ముగించుకుని హైదరాబాద్‌ వెళ్తుండగా రామగిరి మండలం కల్వచర్ల పెట్రోలు బంకు ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి వారిపై దాడికి పాల్పడ్డారు. కారులో ఉన్న వామన్‌రావు, నాగమణిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. 108 వాహనంలో పెద్దపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వారిద్దరూ మృతిచెందారు. న్యాయవాది హత్యకు నిరసనగా నేడు తెలంగాణలో కోర్టులను బహిష్కరించాలని న్యాయవాదులు నిర్ణయించారు.

Tags:    

Similar News