హైకోర్టులో టీటీడీకి ఎదురుదెబ్బ

Update: 2018-12-13 14:03 GMT

మిరాశి అర్చకులకు రిటైర్మెంట్ అంశంలో టీటీడీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మిరాశి వంశీయులకు రిటైర్మెంట్ లేకుండా కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తిరుమలతో పాటు గోవిందరాజస్వామి దేవస్థానం, తిరుచానూరు ఆలయాల్లో రిటైర్మెంట్ నిబంధనను టీటీడీ అమలు చేసింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ మిరాశి వంశీయులు హైకోర్టును ఆశ్రయించగా వారిని కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుపై మిరాశి వంశీయులు హర్షం వ్యక్తం చేస్తుండగా సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని టీటీడీ భావిస్తోంది.

Similar News