కరోనా కేసుల పెరుగుదలపై హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరగడం పై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రోజుకు పదిహేను వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయని పేర్కంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో [more]

Update: 2021-05-05 01:19 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరగడం పై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రోజుకు పదిహేను వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయని పేర్కంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆక్సిజన్ సరైన సమయంలో అందించాలని సూచించింది. ఆక్సిజన్, పడకలు, ఔషధాలు, కోవిడ్ పరీక్షల ఫలితాలు, వ్యాక్సినేషన్ వంటివి నిర్వహించాలని సూచించింది. ఈ నెల 6వ తేదీలోపు హైకోర్టుకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags:    

Similar News