నాలుగు సీట్ల కోసం గులాంగిరీనా..?

Update: 2018-11-12 12:06 GMT

నాలుగు సీట్ల కోసం ప్రొ.కోదండరాం ఢిల్లీకి, అమరావతికి గులాంగిరి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇవాళ పలువురు టీజేఎస్ నాయకులు హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... కోదండరాం పాత రోజులను గుర్తు తెచ్చుకోవాలని, కాంగ్రెస్, టీడీపీలు ఆయనపై దాడి చేస్తుంటే టీఆర్ఎసే కాపాడిందన్నారు.

ఎలా పొత్తు పెట్టుకున్నారు..?

ఐకాసను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించిన వారితో కోదండరాం పొత్తు ఎలా పెట్టుకున్నారని ప్రశ్నించారు. గతంలో టీడీపీని తెలంగాణ ద్రోహి అని కోదండరాం అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలవలేని సీట్లను తెలంగాణ జన సమితికి ఇస్తుందని, ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఖాళీ అవడం ఖాయమన్నారు. ఉద్యమంలో విద్యార్థులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జైళ్లలో పెట్టిస్తే టీఆర్ఎస్ బెయిళ్లు తీసుకువచ్చి బయటకు తెచ్చిన విషయాన్ని కోదండరాం మరిచిపోయారా అని ప్రశ్నించారు.

Similar News