మరో ఎమ్మెల్యే బై…బై….!!

కాంగ్రెస్ ఖాళీ అవుతుంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం, సబితా ఇంద్రారెడ్డి సయితం టీఆర్ఎస్ లోకి సిద్దమవుతుండటం ఆ పార్టీని [more]

Update: 2019-03-11 02:06 GMT

కాంగ్రెస్ ఖాళీ అవుతుంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం, సబితా ఇంద్రారెడ్డి సయితం టీఆర్ఎస్ లోకి సిద్దమవుతుండటం ఆ పార్టీని కలవరపరుస్తోంది. ఇదిలా ఉండగానే తాజాగా ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ తాను కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ప్రకటించారు. ఇల్లెందు ప్రాంత అభివృద్ధి కోసమే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు హరిప్రియ ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతన్న సమయంలో, లోక్ సభ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలయిన గంటల్లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికార టీఆర్ఎస్ లో చేరుతుండటం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ.

Tags:    

Similar News