సూచనలే… జోక్యం లేదు

రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రం సూచనలు చేస్తుందే తప్ప జోక్యం చేసుకోదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. రాజధాని విషయంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం [more]

Update: 2019-12-30 12:23 GMT

రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రం సూచనలు చేస్తుందే తప్ప జోక్యం చేసుకోదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. రాజధాని విషయంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదన్నారు. రాజధాని పలానా చోట పెట్టమని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పలేదన్నారు జీవీఎల్. అలాగే రాజధాని మార్పు విషయంలో కూడా జోక్యం చేసుకోబదన్నారు. తాను జాతీయ పార్టీ విధానాలను మాత్రమే చెబుతున్నానన్నారు. రాజధాని రైతులకు మాత్రం న్యాయం చేయాలని తాను వ్యక్తిగతంగా కోరుతున్నానని చెప్పారు.ఏపీ రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేదన్నారు జీవీఎల్.

Tags:    

Similar News