నేడే శాసనమండలి ఛైర్మన్ పదవికి నామినేషన్లు

శాసనమండలి ఛైర్మన్ పదవికి ఇవ్వాళ నామినేషన్లు దాఖలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఛైర్మన్ పదవికి టిఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీలో [more]

Update: 2019-09-09 06:22 GMT

శాసనమండలి ఛైర్మన్ పదవికి ఇవ్వాళ నామినేషన్లు దాఖలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఛైర్మన్ పదవికి టిఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత శాసనమండలి ఛైర్మన్ గా స్వామిగౌడ్ కొనసాగారు. ఆయన పదవీ కాలం మార్చిలో ముగిసింది. దీంతో అప్పటి నుంచి తాత్కాలిక ఛైర్మన్ గా ఛైర్మన్ నేతి విద్యాసాగర్ కొనసాగుతున్నారు.

Tags:    

Similar News