ఆ కుటుంబానికి ఇంటి స్థలాన్ని ఇచ్చిన ప్రభుత్వం

గుంటూరులో దారుణ హత్య కు గురైన రమ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. రమ్య కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో చెల్లించిన ప్రభుత్వం [more]

Update: 2021-08-20 08:21 GMT

గుంటూరులో దారుణ హత్య కు గురైన రమ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. రమ్య కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో చెల్లించిన ప్రభుత్వం తాజాగా ఇంటి పట్టాను కూడా అందజేసింది. ఈరోజు హోంమంత్రి మేకతోటి సుచరిత రమ్య కుటుంబ సభ్యులు ఇంటి పట్టాను అందచేశారు. అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని ఇస్తామని సుచరిత చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిగతంగా ఈ సంఘటనపై బాధపడ్డారన్నారు. ఆయనే దగ్గరుండి బాధితులకు అందాల్సిన పరిహారాలను అందేలా చర్యలు తీసుకుంటున్నారని మేకతోటి సుచరిత చెప్పారు.

Tags:    

Similar News