అక్కడ మాత్రం ఎన్నికలు లేవట

రాజధాని ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది. రాజధాని ప్రాంతంలో గత మూడు నెలలుగా ఆందోళనలు [more]

Update: 2020-03-08 12:19 GMT

రాజధాని ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది. రాజధాని ప్రాంతంలో గత మూడు నెలలుగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఎన్నికల నిర్వహణ కష్టసాధ్యమని ప్రభుత్వం భావించింది. అందుకోసం రాజధాని ప్రాంతంలోని 19 గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం లేఖ రాసింది. హైకోర్టులో ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు కేసులు వేసి ఉన్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ అనవసరమని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల కమిషన్ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Tags:    

Similar News