విజయవాడలో అక్కడ కర్ఫ్యూ

విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. పాత రాజరాజేశ్వరీ పేట, భవానీ పురం ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. ఇక్కడ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండటంతో [more]

Update: 2020-04-01 04:02 GMT

విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. పాత రాజరాజేశ్వరీ పేట, భవానీ పురం ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. ఇక్కడ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండటంతో కర్ఫ్యూ విధించారు. ఈ ప్రాంతంలోని వారు ఇళ్లు వదలి బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మైకుల ద్వారా చెబుతున్నారు. మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఈ ప్రాంతంలో సంచరించారని తెలిసి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఇప్పటికే ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 58 నమోదయ్యాయి.

Tags:    

Similar News