ఏపీ చెక్ పోస్టుల వద్ద ఆంక్షలు కఠినతరం

ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్లేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. ఈపాస్ ఉన్నవారిని, కరోనా పరీక్షలు చేయించుకున్న వారికి మాత్రమే ఏపీలోకి అనుమతించాలని [more]

Update: 2020-06-29 04:32 GMT

ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్లేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. ఈపాస్ ఉన్నవారిని, కరోనా పరీక్షలు చేయించుకున్న వారికి మాత్రమే ఏపీలోకి అనుమతించాలని నిర్ణయించారు. అదీ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ మాత్రమే వాహనాలకు అనుమతి ఉంటుంది. నిత్యావసరవస్తువుల వాహనాలకు మాత్రం ఇందుకు మినహాయింపు ఇచ్చారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఏపీ చెక్ పోస్టుల వద్ద నిబంధనలను కఠినతరం చేశారు.

Tags:    

Similar News