అమెరికాలో తెలంగాణవాసి దారుణహత్య

అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం చోటు చేసుకుంది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కొత్త గోవర్ధన్‌రెడ్డిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఏడేళ్ల క్రితం ఉద్యోగరీత్యా [more]

Update: 2019-02-21 02:06 GMT

అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం చోటు చేసుకుంది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కొత్త గోవర్ధన్‌రెడ్డిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఏడేళ్ల క్రితం ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లిన గోవర్ధన్‌రెడ్డి డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌లో మేనేజరుగా పనిచేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8.30గంటలకు స్టోర్‌లోకి చొరబడిన దుండగులు గోవర్ధన్‌రెడ్డితో పాటు మరో వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈఘటనలో గోవర్ధన్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో గంటన్నరలో స్టోర్‌ మూసేసి గోవర్ధన్‌రెడ్డి ఇంటికి వెళ్దామనుకున్న సమయంలో ఈఘటన చోటుచేసుకుంది. కాల్పులకు తెగబడిన దుండగులను నల్లజాతీయులుగా గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. గోవర్ధన్‌రెడ్డి మృతదేహాన్ని ఫ్లోరిడాలోని మార్చురీలో భద్రపరిచారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ప్రభుత్వం సహకరించాలని బాధిత కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. గోవర్ధన్‌రెడ్డి భార్య, ఇద్దరు కుమార్తెలు హైదరాబాద్‌ ఉప్పల్‌లో నివాసముంటున్నారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. గోవర్ధన్‌రెడ్డి పెద్ద కుమార్తె పదో తరగతి, చిన్న కుమార్తె ఏడో తరగతి చదువుతున్నారు.

తిరిగి వద్దామనుకుంటున్న తరుణంలో…..

బతుకుదెరరువు కోసం 8 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లి ఇంకా రెండు నెలలో తిరిగి స్వదేశానికి వద్దామని అనుకున్నాడు.. కానీ మృత్యువాత పడ్డాడు. యాదాద్రి జిల్లా ఆత్మకూర్ మండలం రహీంఖాన్ పేట్ గ్రామానికి చెందిన గోవర్ధన్ గత 8 సంవత్సరాలుగా అమెరికా లోని ఫ్లోరిడా లో స్టోర్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. 19 వ తేదీ రాత్రి 8 గంటల సమయం లో నల్లముసుగు వేసుకున్న వ్యక్తి స్టోర్ లో తుపాకీ తో కాల్చి చంపాడు. ప్రస్తుతం ఉప్పల్ స్వరూప్ నగర్ లో ఉంటున్న కుటుంబసభ్యులకు విషయం తెలియడం తో విషాదఛాయలు అలుముకున్నాయి. గోవర్ధన్ కు భార్య , ఇద్దరు అమ్మాయిలు కాగా ఇంకా రెండు నెలలో ఇండియా కి తెరిగివెచ్చే సమయం లో ఇలా జరిగిందని గోవర్ధన్ సోదరులు రమేష్, మధుసూదన్ తెలిపారు. గోవర్ధన్ కుటుంబానికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని త్వరగా గోవర్ధన్ పార్థివదేహాన్ని ఇక్కడికి వచ్చే విదంగా చూడాలని కోరారు

Tags:    

Similar News