ఎల్.బి..నగర్ నుంచి ఇక హాయి..హాయిగా....!

Update: 2018-09-24 07:02 GMT

హైదరాబాద్ నగర వాసులు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు మరో ముందడుగు పడింది. ఎల్బీనగర్ - అమీర్ పేట మార్గంలో మెట్రో రైలును గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. 16 కిలోమీటర్ల ఈ మార్గంలో ఇవాళటి నుంచి మెట్రో రైళ్ల రాకపోకలు ప్రారభమయ్యాయి. ఈ మార్గంలో మొత్తం 17 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఇక ఈ మార్గంలోని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ ఆసియాలోనే అతిపెద్ద మెట్రో స్టేషన్ గా కూడా రికార్డులకు ఎక్కింది. ఈ మార్గం పూర్తి కావడంతో ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు 50 నిమిషాల్లో మెట్రో రైలు ద్వారా చేరుకోవచ్చు.

Similar News