భార్య కోసం భర్త...వేసిన ప్లాన్...?

Update: 2018-07-14 14:21 GMT

ఈ స్టోరీలో నిజంగా సినిమా లాంటి కష్టాలే..అయితే సినిమాల్లో కొంత డ్రామా వుంటుంది. కాని ఇక్కడ నిజజీవితంలో వచ్చే సరికి కొంత ఛేంజ్ వుంది. భార్య కొరకు దొపిడి దొంగగా మారాడు. కిడ్ని ఆపరేషన్ చేయించుకున్న తరువాత డబ్బుల కోసం ఏకంగా జ్యుయలరీ షాపులోనే దోపిడి చేశాడు. భార్య భర్తలు కలిసి దోపిడీ దొంగల్లా మారి ప్రొపెషనల్ దొంగల్లాగా చోరీ చేసి కిలోల కొద్ది బంగారం ఆభరణాలను ఎత్తుకుని పొయిన తీరు ఇది. పది రొజుల క్రితం పోలీసులకు ముచ్చెటలు పట్టే విధంగా ఒక్క చోరీ జరిగింది.. గతంలో ఉగ్రవాదులు చేసిన దోపిడిల్లాగానే ఇది కూడా చేశారు.. రాత్రి సమయంలో జరిగిన ఈ జ్యుయలరీ షాపు చోరీలో పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. బురఖా లో వచ్చిన ఒక మహిళలతో పాటుగా ఒక వ్యక్తి కలిసి ఈ దోపిడీ చేశారు.. అయితే దోపిడీ జరిగిన సమయంలో అక్కడ వున్న సీసీ కెమెరాలు తప్ప... పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. అంతేగాకుండా అర్థరాత్రి కావడంతో బయట ఎక్కడ కూడా సీసీ టీవి పుటేజీలు కూడా దొరకలేదు. ఈ దొంగలను పట్టుకొవడానికి ఏకంగా ఆరు టీమ్ లను పోలీసులు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ దొంగల కోసం మూడు రాష్ట్రాల్లో పోలీసులు గాలించారు. చివరకు దొంగలను పట్టుకొగలిగారు పోలీసులు.

గంటలో పనిముగించుకుని....

ఈ నెల మూడో తేదీ. అది అమీన్ పూర్ ప్రాంతం. రాత్రి తొమ్మిది గంటల సమయం..యాజమాని జయరాం అప్పడే షాపు క్లొజ్ చేసి ఇంటికి వెళ్లే ప్రయత్నంలో వున్నాడు. ఇంతలో దంపతులు బంగారం ఆభరణాలు కొనుగొలు చేయడానికి వచ్చారు. వచ్చిన వారు బంగారు కమ్మల కోసం వచ్చామని చెప్పారు. కొంత సేపు అక్కడ వున్న అభరణాలను చూశారు. ఇదే సమయంలో జయరాం షాపులో వున్న బంగార ఆభరణాలను తీసి లోపల వున్న చెస్ట్ లో పెట్టేందుకు ఉపక్రమిస్తున్నారు. అప్పటికే సమయం పది గంటలు దాటి పొయింది. చెస్ట్ లో బంగారు ఆభరణాలు పెట్టేందుకు వెళ్లిన జయరాంతో పాటుగా బురఖాలో వున్న మహిళ కూడా లోపలికి వెళ్లింది. లొపలికి వెళ్లిన మహిళ వెంటనే జయరాం మీద దాడి చేసింది. ఉహించని దాడితో జయరాం వెంటనే కింద పడిపొయాడు. ఇంతలో బయట వున్న వ్యక్తి లొపలికి వచ్చాడు. గన్ చూపెట్టి జయరాం పైన దాడి చేశాడు. అయితే జయరాం వెంటనే తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో బురఖాలో ఉన్న మహిళ జయరాం కళ్లులో కారం కొట్టి రూం లో బంధించింది.

బంగారం మొత్తం దోచుకుని....

అయితే దాదాపుగా గంట పాటు షాపు లోపల వున్న బంగారంతో పాటు వెండి వస్తువులన్నింటికి తీసుకుని వెళ్లిపొయారు. ఈ కేసులో పోలీసులకు షాపులో వున్న సీసీ పుటేజీలు తప్ప ఎలాంటి క్లూ లభించలేదు. అంతేగాకుండా వచ్చిన వాళ్లు ఎలా వెళ్లిపోయారో కూడా అర్దం కాలేదు. దీంతో ఇటు హైదరబాద్ తో పాటుగా అటు ముంబాయ్ హైవేలపైన వున్న సీసీ కెమోరాలను పోలీసులు పరీశీలించారు. సంగారెడ్డికి వంద కిలో మీటర్ల తరువాత ఈ మహిళ బురఖా తీసిన విజువల్స్ పోలీసులకు చిక్కాయి. అయితే చోరీ చేసిన వారు ఎవరో? ఎంటో? కూడా తెలియలేదు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సైబరాబాద్.. సంగారెడ్డిజిల్లా పోలీసులు పోటీపడి మరీ కేసును ఓ కొలిక్కి తీసుకువచ్చారు. పదిరోజుల్లో నిందితులను కర్నాటకలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను పక్కదారి పట్టించేందుకే వేషం మార్చి మరీ దోపిడీ చేసినట్లు గుర్తించారు.

కిడ్నీ మార్పిడి కోసం.....

అయితే దొంగలు చెప్పిన కధ మొత్తం కూడా సినిమా స్టోరీని తలపించే విధంగా వుంది. దొంగతనానికి పాల్పడ్డ నిందితులు వెల్లడించిన ఆసక్తికర విషయాలు..ఒరిస్సా కు చెందిన సునీల్ మహాతో, సునీతా మహాతో భార్యా భర్తలు..కిడ్నీ వ్యాది తో బాధపడుతున్న సునీతా మహాతో..కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఏడాదిన్నర క్రితం భార్యాభర్తలు నగరానికి వచ్చారు. అమీన్ పూర్ లోని మోడీ బిల్డర్స్ అపార్ట్ మెంట్ లో ఏడాదిన్నరగా నివాసముంటున్నారు. గత కొంత కాలంగా జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సునీత మహాతో..ఇప్పటికి వైద్యం కోసం ఏడున్నర లక్షలు ఖర్చు చేశారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కు మరిన్ని డబ్బులు అవసరం కావడం తో దొంగ తనానికి ఈ భార్యాభర్తలు పాల్పడ్డారు.

Similar News