Telangana : మంత్రి గంగులకు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో కరోనా కలకలం రేపుతుంది. అక్కడ ప్రచారంలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ కు [more]

Update: 2021-10-13 01:29 GMT

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో కరోనా కలకలం రేపుతుంది. అక్కడ ప్రచారంలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన గత కొద్ది రోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. పరీక్షలు చేయించడంతో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో మంత్రి గంగుల కమలాకర్ హోం ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. తనను వారం రోజులుగా కలసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని గంగుల కమలా కర్ కోరారు.

Tags:    

Similar News