Hyderabad : నేడు గణేష్ నిమజ్జనం

హైదరాబాద్ లో నేడు గణేష్ నిమజ్జనం జరగనుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్యాంక్ బండ్ చుట్టూ [more]

Update: 2021-09-19 02:26 GMT

హైదరాబాద్ లో నేడు గణేష్ నిమజ్జనం జరగనుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్యాంక్ బండ్ చుట్టూ భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేష్ ను ఉదయమే నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జంటనగరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నిమజ్జనం కోసం మెట్రో రైళ్లను ప్రత్యేకంగా నడుపుతున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నిమజ్జనాన్ని జరుపుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Tags:    

Similar News