మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్నోలోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న [more]

Update: 2021-08-22 03:05 GMT

ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్నోలోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్యాణ్ సింగ్ మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కల్యాణ్ సింగ్ మృతి పార్టీకి తీరని లోటు అని బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షాలు అన్నారు. రెండుసార్లు ఉత్తర్ ప్రదేశ్ కు కల్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. గవర్నర్ గా కూడా కల్యాణ‌్ సింగ్ పనిచేశారు. నేడు కల్యాణ్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి.

Tags:    

Similar News